ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వైపు కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఉంటే.. మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు కొందరు. ఇక సొంత అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న అనుమానంతో బావమరిదిని బావ కొట్టి చంపేయడం జరిగింది. ఈ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా దర్శి మండలం నిమ్మ రెడ్డి పాలెంలో రామస్వామి ... పోయిన సంవత్సరంలో సొంత ఇల్లు కట్టుకునే కోసం భూమి పూజ నిర్వహించారు.

 


ఆ కార్యక్రమానికి బంధువులు అందరూ రావడంతో అక్క ఇంటికి వెళ్లి పడుకోవడం జరిగింది. ఆ సమయంలో అక్క పక్కనే రామస్వామి పడుకున్నాడు. ఇది గమనించిన తన బావ అయినా సుబ్బారావు సొంత అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని అనుమానించడం మొదలు పెట్టాడు. దీనితో తన భార్యతోనే రాసలీలలు కొనసాగిస్తున్నాడు అన్న అనుమానంతో రోజురోజుకీ అతనిపై అనుమానం పెంచుకున్నాడు సుబ్బారావు. ఇక సమయం చూసి రామస్వామిని అంతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 


ఇక ఇటీవల రాత్రి సమయంలో రామస్వామిని దారుణంగా గొర్రెల దొడ్డి వద్ద సుబ్బారావు కొట్టి చంపేశాడు. అంతటితో కాకుండా రోకలిబండతో ముఖంపై గట్టిగా కొట్టడంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యతో ప్రశాంతంగా ఉన్న పల్లె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఊర్లో మంచి పేరు ఉన్న రామస్వామిని ఎవరు హత్య చేశారు అని ఎవరికీ అర్థం అవ్వలేదు. అప్పటి నుంచి పరారీలో ఉన్న బావ సుబ్బారావు విఆర్వో వద్దకు వచ్చి స్వయంగా తానే లొంగిపోయినట్లు పోలీస్ అధికారులు తెలియజేస్తున్నారు. దీనితో నిందితుడైన సుబ్బారావు చంపేందుకు ఉపయోగించిన రోకలిబండను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ అధికారులు నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: