కొడుకు తప్పుచేస్తే మందలించి సరైన దార్లో పెట్టవలసింది పోయి ఆ తల్లిదండ్రులు కూడా ఆ తప్పును సరిదిద్దడం అనేది అతి నీచమైన చర్య.. పోనీ అతడు చేసింది ఏదో ఎవరికి హాని కలిగించని పొరబాటు అనుకుంటే అదీ కాదు.. ఒక వివాహిత ప్రాణం పోవడానికి కారణమైయ్యాడు.. కామాంధుడిగా మారి పచ్చని సంసారంలో నిప్పులు పోసాడు.. ఆ వెధవకు సంబంధిచిన వివరాలు తెలుసుకుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఓ తండాలో వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన ఒక వివాహిత (43) భర్త, తన ఇద్దరు పిల్లలతో  నివసిస్తోంది..

 

 

కాగా అదే ప్రాంతానికి చెందిన బానోత్‌ మధు(21) అనే నీచుడు ఈ వివాహితపై కన్నేశాడు. ఈ నేపధ్యంలో ఆమెపై కోరికను పెంచుకున్న ఈ కామాంధుడు ఏడాది క్రితం ఆమె స్నానం చేస్తుండగా తన ఫోన్‌లో చిత్రీకరించి, ఆ దృశ్యాలను ఆమెకు చూపించి లోబరుచుకునేందుకు యత్నించాడు. కానీ ఆమె అతనికి లొంగక పోగా తండాలో ఫిర్యాదు చేయడంతో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి అతణ్ని మందలించి పంపించేశారు.. అలా కొన్నాళ్లు ఆమె జోలికి రాని అతనిలో మళ్ళీ ఆమెపట్ల కామం బుసలు కొట్టగా గత నెల రోజులుగా ఆ వివాహిత భర్త లేని సమయాల్లో ఇంట్లోకి వెళ్లి బెదిరించడం మొదలు పెట్టాడట. తన శారీరక కోరిక తీర్చకుంటే నీ భర్తను చంపేస్తానని బెదిరించి చివరకు ఎలాగోలా ఆ మహిళను లొంగదీసుకుని తన పశువాంచ తీర్చుకున్నాడట..

 

 

ఆ సమయంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న దృశ్యాలను కూడా చిత్రీకరించి, వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తూ ఆమెపై కోరిక పుట్టినప్పుడలా  లైంగిక దాడిని కొనసాగిస్తూ వస్తున్నాడట ఈ దరిద్రుడు. ఇలా అతని వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతుండటంతో, భరించలేక జరిగిన విషయాన్ని భర్తకు చెప్పగా, ఆయన పాల్వంచ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ మృగాడు, అతని తల్లిదండ్రులు బాధితురాలి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషించినట్టు సమాచారం.

 

 

దీంతో మనస్తాపానికి గురైన ఆమె పురుగు మందు తాగింది. కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెలవారు జామున మృతిచెందిందట.. ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు, అతని తల్లిదండ్రులు పరారు అయ్యారట.. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు, అతని తల్లిదండ్రుల కోసం వెతుకులాట ప్రారంభించారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: