ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అమితమైన అభిమానం ని చూపిస్తూ ఎప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పగా చెబుతూ ఉంటారు నటుడు పోసాని కృష్ణ మురళి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని అమితంగా ఆరాధిస్తారు ఆయన. ఎవరైనా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తే వారికి కౌంటర్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళి జగన్మోహన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి  ఏడాది గడిచిపోతున్న సమయంలో... జగన్ సర్కారు చేసిన పనులు పథకాల గురించి గొప్పగా చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ మురళి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని  వన్ మాన్ ఆర్మీగా  అభివర్ణించారు పోసాని కృష్ణ మురళి. 

 


 అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే తాను చేయాలనుకున్న అన్ని పనులను వన్ మాన్ ఆర్మీ లాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు అంటూ సినీ నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. ప్రజలకు తాను చేస్తాను అని చెప్పినా అన్ని హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా  లాంటి సంక్షోభం సమయంలో కూడా... ప్రజలకు ఎక్కడ సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదు అంటూ ప్రశంసించారు. తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన నటుడు krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

 ఈ సందర్భంగా విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు పరిహారం గురించి కూడా మాట్లాడారు పోసాని కృష్ణ మురళి. విశాఖ గ్యాస్ ప్రమాద బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇండియా లోని ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదని.. కేవలం అది జననేత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది అంటూ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో కృష్ణా పుష్కరాల్లో మరణించిన వారికి కేవలం పది లక్షల రూపాయల పరిహారం మాత్రమే ఇచ్చారని... తాజాగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వంతో సంబంధం లేకున్నప్పటికీ కోటి రూపాయల పరిహారాన్ని అందించి జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు అంటూ వ్యాఖ్యానించారు పోసాని కృష్ణ మురళి. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలు అన్ని వర్గాల సంక్షేమం కోరుతున్నాయి అంటూ చెప్పుకొచ్చిన  పోసాని కృష్ణ మురళి... వృద్ధులు వికలాంగులు తదితరులకు ఇచ్చే పెన్షన్లు ఇంటికి వెళ్లి  ఇవ్వడం దేశంలోనే ఎక్కడా చూడలేదు అంటూ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: