ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల పై అఘాయిత్యాలు చాలా ఎక్కువ అయ్యాయి. పసిపిల్లలను అని కూడా చూడకుండా కొందరు పసిపిల్లలను చెత్త కుండీలలో పడేస్తున్నారు. అలానే పలుచోట్ల చిన్నపిల్లలు  కిడ్నాప్ లకు పాలుపడుతూ ఉంటారు. ఈ తరుణంలో రెండు నెలల బాబుని అమ్మడం జరిగిన సంఘటన ఒకటి జరిగింది. అది కూడా ఎక్కడో కాదండీ మహా నగరమైన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

IHG


ఇక దీనికి సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాదులోని జీడిమెట్ల పీఎస్ పరిధిలో రెండు నెలల పిల్లాడిని విక్రయం చేసినట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ సంఘటన అందరిలో సంచలనం సృష్టించింది. పోలీస్ అధికారులు తెలిపిన కథనాల మేరకు...  మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాకు చెందిన శేషు అనే వ్యక్తి గాజులరామారం కు చెందిన సింగ్ అనే వ్యక్తికి బాబును అమ్మడం కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇటీవలే వీరి ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. 

IHG


ఇకపోతే ఈ తరుణంలో డబ్బులకు సంబంధించిన వ్యవహారం జరగడంతో తన బాబును తనకే ఇవ్వాలి అంటూ శేషు పోలీసులను ఆశ్రయించడంతో జరిగింది. ఇలా ఉండగా మరోవైపు లక్ష రూపాయలు ఇచ్చి బాబుని విక్రయించారు అని సింగ్ అనే వ్యక్తి తెలియజేస్తున్నాడు. కానీ శేషు మాత్రం అతను అబద్ధాలు చెబుతున్నాడు, మాకు కేవలం 22 వేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు అంటూ పోలీస్ అధికారులకు తెలియజేశారు. దీనితో పోలీస్ అధికారులు పసిపిల్లలను ఇలా అమ్మడం లేదా కొనడం రెండు విధాలుగా నేరమే అంటూ వారిద్దరిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనపై పోలీసు అధికారులు మరింత విచారణ మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: