మెగాబ్రదర్ జనసేన నాగబాబు ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎవరెన్ని విమర్శలు చేసినా ముక్కు సూటిగా మాట్లాడితు  మనసులో అనిపించింది బయటకు చెబుతుంటారు నాగబాబు. మొన్నటికి మొన్న గాంధీని హత్య చేసిన ఘటన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గాడ్సే నిజమైన దేశభక్తుడు అని అభివర్ణించడం తో నాగబాబు ఎన్నో  విమర్శలు కూడా ఎదుర్కొన్నారు . అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా నాగబాబు మాత్రం అస్సలు తగ్గడం లేదు


 తాజాగా మరోసారి సంచలన పోస్ట్  లతో మరోసారి సంచలనం సృష్టించాడు. ఈసారి ఇండియన్ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు మరికొందరి మహనీయుల ఫోటోలను కూడా  కరెన్సీ నోట్లపై  కూడా చూడాలని ఉంది అంటూ పేర్కొన్నారు నాగబాబు. ఒకవేళ మహాత్మాగాంధీ బతికి ఉంటే కరెన్సీ నోట్లపై ఎవరి బొమ్మలు ఉంటే బాగుండేది అని అనుకునేవారు అంటూ ఓ  ప్రశ్న వేశారు. సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం,  సావర్కర్, వాజ్పేయి లాంటి మహానుభావుల చిత్రాలను కూడా భారత కరెన్సీ నోట్లపై చూడాలని ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో భారత ఖ్యాతిని పెంచిన మహానుభావులు కొంతమందైతే భారత స్వాతంత్రం కనీసం పోరాటం చేసి అమరులైన వారు  మరికొంతమంది. వీరిని మర్చిపోకూడదు అని ఆశ ఉందని తెలిపాడు. 

 


 ఒకవేళ గాంధీ గారు బతికుంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన ఎంతోమంది దేశభక్తులను గౌరవించాలని  చెప్పేవారు అంటూ వ్యాఖ్యానించారు నాగబాబు. భావితరాలకు కరెన్సీ నోట్లపై ఎంతోమంది దేశం కోసం పాటుపడిన మహానుభావుల పరిచయం చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాగబాబు వ్యాఖ్యలు  ఎంతగానో సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే గతంలో నోట్ల రద్దు చేసిన సమయంలో ఏకంగా మోడీ సర్కార్ కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మార్చి వేరే బొమ్మలు ముద్రిస్తుంది అనే టాక్  కూడా వినిపించింది. కానీ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీ సహా మరికొన్ని పార్టీలు ఏకమై ఎలక్షన్ సమయంలో దీనిని అస్త్రంగా మార్చుకోవడంతో మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది. మరి రాబోయే రోజుల్లో ఇలాంటిది  ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: