డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. వారు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే సీబీఐ విషయంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరును ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అసలు సీబీఐ ఏపీ అడుగుపెట్టకుండా జీవో కూడా తీసుకొచ్చారు.

 

 

అలాంటి టీడీపీకి ఇప్పుడు సీబీఐ ఎలా కావాల్సి వచ్చిందని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలో అవసరం లేని సీబీఐ ఇప్పుడు అవసరం వచ్చిందా..? అని హోం మంత్రి సుచరిత నిలదీశారు. పుష్కరాల తొక్కిసలాటలో జనం చనిపోతే సీబీఐ గుర్తుకురాలేదా..? అని చంద్రబాబును సుచరిత ప్రశ్నించారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతివ్వటానికి వీల్లేదంటూ చంద్రబాబు గతంలో జీవోలు ఇచ్చారని సుచరిత గుర్తు చేశారు.

 

 

అప్పుడు అవసరం లేని సీబీఐ ఇప్పుడు కావాలని చంద్రబాబు అంటున్నారన్నారు. గతంలో ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని సచురిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ఏడాదిగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని హోంమంత్రి సుచరిత అన్నారు. ఏడాదికాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగామన్నారు. చంద్రబాబు వెళ్తూ వెళ్తూ.. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసి వెళ్లాడని, రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని సుచరిత విమర్శించారు.

 

 

 

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా.. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి సుచరిత అన్నారు. అదే విధంగా మహిళా రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటుతో పాటు పోలీసులకు వీక్లి ఆఫ్‌లు తీసుకొచ్చామని, పాఠశాల విద్యలో సమూల మార్పులు తెచ్చామని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: