గత కొద్దీ రోజుల నుండి కేరళ లో కరోనా కేసులు  భారీగా నమోదువుతున్నాయి. విదేశాల నుండి అలాగే  వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వారి వల్ల కేసుల సంఖ్య  పెరుగుతూ వస్తుంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా 49 కేసులు నమోదయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అందులో18 కేసులు విదేశాల నుండి రాగ 25 వేరే రాష్ట్రాల నుండి వచ్చినవి మరో కాంటాక్ట్ కేసులు. ఈ కొత్త కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు 896 కేసులు నమోదు కాగా అందులో 532 కోలుకొని ఐదుగురు మరణించారు. ప్రస్తుతం 359 కేసులు యాక్టీవ్ గావున్నాయి.
 ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా తమిళనాడు లో ఈ ఒక్క రోజే కొత్తగా 805 కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో 44 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ లో ఈ రోజు కొత్తగా 66కేసులు నమోదు కాగా ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 1920 కు చేరింది. అందులో 1164 కోలుకొని 56మంది మరణించారు.  ప్రస్తుతం 700 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: