ఈ మద్య కొంత మంది తమ సుఖం తామే చూసుకుంటున్నారు.. పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వకుండా వివాహేతర సంబంధాలతో భర్తను భార్య, భార్యను భర్త చంపుకునే పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు ఎన్నో సంఘటనలు ఉదాహణగా చెప్పొచ్చు.  దేశమంతా ఇప్పుడు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుంది.. ఇలాంటి సమయంలో కరోనా బాధితుడైన తన భర్తకు సేవాలు చేయాల్సిందిపోయి.. తన సుఖం కోసం ప్రియుడితో అతని భార్య లేచిపోయింది.  ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.  ముందేరి గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి.. కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లాడు.  కొంత కాలంగా ఆయన ఢిల్లీలో భవన నిర్మాణం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.  

 

ఇతని భార్యా పిల్లలు కూడా ఢిల్లీలోనే ఉండేవారు. ఏడాదిన్నర క్రితం.. భార్యాపిల్లలు ముందేరికి తిరిగి రాగా, భర్త మాత్రం ఢిల్లీలోనే ఉన్నాడు. ఇంతలోనే లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉపాధి లేకపోవడంతో సదరు వ్యక్తి సొంతూరికి రావాలని నిర్ణయించుకున్నాడు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైల్లో ఢిల్లీ నుంచి ఛత్తర్‌పూర్‌ జిల్లాకు మే 19న చేరుకున్నాడు. అయితే కోవిడ్ -19 రూల్స్ ప్రకారం క్వరాంటైన్ తప్పకుండా ఉండాలన్న ఉద్దేశంతో అతను తన పైగదిలో 14 రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లాడు.  భార్యాపిల్లలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు.

 

ఈ సమయంలో భర్తకు సేవ చేయాల్సిన భార్య తన సుఖం కోసం ఆరాటపడింది. ఇదే మంచి అదును అనుకొని మే 24వ తేదీన భార్య ఎవరికీ చెప్పకుండా.. ప్రియుడితో వెళ్లిపోయింది. భర్త ఉన్న గదికి బయటి నుంచి తాళం వేసింది. మొత్తానికి భర్త గది నుంచి బయటకు వచ్చి భార్య అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: