ప్రస్తుత రోజుల్లో మహిళలు, బాలికలపై సొంత తోబుట్టువులే అత్యాచారానికి పాల్పడుతున్నారు. అభం, శుభం తెలియని తన చెల్లెలి పై అన్న, తన ముగ్గురు స్నేహితులతో కలసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ బాలికను గొంతు నులిమి చంపేసిన సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. 


ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే... జైపూర్ శివారు లోని మనోహర్ ‌పూర్ ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని పదేళ్ల బాలిక ఈ నెల 17 నుంచి కనిపించడం లేదు. బాలిక తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ అధికారులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడా ఆ బాలిక జాడ తెలియలేదు. ఆ తర్వాత మరో మూడు రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులు మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చి కనిపించకుండా పోయిన ఆ బాలిక దుస్తులను తీసుకుని రావడంతో పోలీస్ అధికారులు మరింత ఎక్కువ స్థాయిలో ఆరా తీయడం మొదలు పెట్టారు.


సమీపంలోని అటవీ అటవీ ప్రాంతంలో బాలికల దుస్తులు లభించాయని తల్లిదండ్రులు పోలీసు అధికారులకు తెలియజేయడంతో అటవీ ప్రాంత పోలీసు అధికారులను సంప్రదించారు. దీనితో పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో మొహరించి బాలిక మృతదేహం కోసం వెతకడంతో చివరికి దొరికింది. ఇక బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేశారని ప్రాథమిక నిర్ధారణను వచ్చాక పోలీసులు ఘటనపై అనుమానితులపై దృష్టి పెట్టడం జరిగింది. 


బాలిక మిస్సింగ్ అయిన రోజునుంచి చివరిగా ఆమె వాళ్ళ అమ్మతో కనిపించిందని విచారణలో తెలియడంతో ఆ దిశగా ఆరా తీయడం మొదలుపెట్టారు పోలీస్ అధికారులు. దానితో పాటే సాంకేతిక సహకారంతో బాలికను రేప్ చేసి హత్య చేసిన అటవీ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేయడం జరిగింది. అంతేకాకుండా మృతురాలి అన్నతో పాటు మరో ముగ్గురు సెల్ ఫోన్ సిగ్నల్ ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు చూపడంతో అన్నని అదుపులోకి  తీసుకుని విచారణ మొదలు పెట్టడంతో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. అడవిలో ఆమెను హత్య చేసేముందు సామూహిక అత్యాచారం చేశామని.. అనంతరం ఆమె గొంతుపిసికి చంపేసినట్లు చెప్పాడు. ఈ సంఘటన నిందితులు అంతా కూడా 19 నుంచి 21 సంవత్సరముల లోపు వారే అవ్వడం గమనించవలసిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: