దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి తో ప్రజలు కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అన్న బాధ ఓ వైపు ఉంటే మరోవైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలను అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలకు చేయడం చేస్తున్నారు. ఇతర క్రేమ్ రేట్ తగ్గినా ఇప్పుుడు ఈ అత్యాచారాల కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. మరీ దారుణమైన విసయం ఏంటంటే క్వారంటైన్ లో ఉన్న మహిళలపై కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా షాద్నగర్ సమీపంలో దిశపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కామంతో రెచ్చిపోయిన నలుగురు కామాంధులు దిశకు మాయమాటలు చెప్పి ఆమెపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ స్టాఫ్ నర్సుపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతికి బలవంతంగా మత్తు మందు ఇచ్చి ఈ ఘటనకు ఒడిగట్టారు. ఈ కీచక పర్వంలో ఆమె ప్రియుడే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న యువతిపై ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.ఆమెకు మాయ మాటలు చెప్పి మత్త కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. ఆ తర్వాత ఎలికట్ట సమీపంలో ఉన్న ఐరన్ ఫ్యాక్టరీ వెనక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమెకు మెలుకువ రావడం.. అప్పటికే తీవ్రంగా గాయపడటం జరిగింది.
ఆ కామాంధుల నుంచి ఎలాగో అలా తప్పించుకొని తన ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే లాక్ డౌన్ సమయంలో ఎంతో సెక్యూరిటీ మద్య ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తన్నారు.