గుజరాత్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకొని వార్తల్లో నిలుస్తుంది. చోటా ఉదేపూర్ జిల్లా లోని మధ్యప్రదేశ్, గుజరాత్ సరిహద్దుల సమీపంలో ఉన్న ఓ మారుమూల గ్రామంలో 17 ఏళ్ల బాలికను తన కుటుంబ సభ్యులు అందరిముందే అతి కిరాతకంగా దూషిస్తూ కొడుతూ నానా రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం నాడు ఉదయం ఇంటర్నెట్ లో వైరల్ కాగా స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


పోలీసులు ప్రకారం... ఈ సంఘటన మే నెలలో చోటు చేసుకోగా... బంధువులు తమ అమ్మాయి వేరొక వ్యక్తితో లేచిపోవడం తో అమ్మాయిని వెతికి ఇంటికి తీసుకు వచ్చి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నిలబెట్టి కర్రలతో చితకబాదుడు బాదారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి అరెస్టులు కాలేదు కానీ ఈ ఘటన లో పాల్గొన్న నిందితులను గుర్తించారు. చోటా ఉదేపూర్ జిల్లా ఎస్పీ బాబర్ మాట్లాడుతూ... కొద్ది రోజుల క్రితం రంగాపూర్ గ్రామంలో 17 ఏళ్ల బాలికను తమ బంధువులు అందరి సమక్షంలో కర్రలతో కొట్టారు. ఆ బాలిక అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తో పారిపోయింది. వైరల్ ఐన వీడియోలో కనిపిస్తున్న ముసలి వ్యక్తి బాలికకు అంకుల్ అవుతాడు. ఈ వీడియోలో ఎవరైతే ఆమెను కొట్టినట్లు కనిపించారో ఆ ముగ్గురిపై FIR నమోదు చేస్తున్నాం. మిగిలిన వారందరినీ విచారించబోతున్నాం. సంబంధిత సెక్షన్ల కింద నిందితులను అరెస్టు చేయబోతున్నాం', అని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే బాధితురాలైన మైనర్ బాలిక తన కుటుంబ సభ్యుల పై ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో మారుమూల గ్రామాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బహిరంగంగా మైనర్ అమ్మాయిల పరువు తీయడానికి కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలోచించకపోవడం అందరి విస్మయానికి కారణమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: