ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కకన్నా చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మాదాపూర్ meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి టవర్స్ లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక కుప్పకూలినట్లు తెలుస్తోందని తొలుత మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంలో తాజాగా పోలీసులు అధికారిక సమాచారం వెలువరించారు. దీంతో సుహారిక మృతిపై మరింత ఉత్కంఠ నెలకొంది.
రాయదుర్గం సీఐ రవీందర్ మీడియాతో మాట్లాడుతూ, meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి బాంబుస్ విల్లాలో ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సుహారిక ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని తెలిపారు. ఆమెను బంధువులు, స్నేహితులు AIG హాస్పిటల్ కి తీసుకువచ్చారని సీఐ తెలిపారు. ``సుహారిక మార్గ మధ్యలోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఓ మహిళ చనిపోయినట్లు హాస్పిటల్స్ వర్గాలు మాకు సమాచారం ఇచ్చారు. దీంతో హాస్పిటల్ చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు, స్నేహితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు`` అని వెల్లడించారు.
మీనాక్షి బాంబుస్ విల్లాలో సుహారికతో పాటు కొంత మంది బంధువులు, స్నేహితులు పార్టీ చేసుకున్నారని సీఐ రవీందర్ వెల్లడించారు. ``పార్టీలో కొద్ది సేపు డాన్స్ చేసిన సుహారిక.. ఒకసారిగా కుప్పకూలింది. వెంటనే హాస్పిటల్స్ కి తరలించగా అప్పటికే సుహారిక మృతి చెందింది. సుహారిక తల్లి, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. పోస్ట్ మార్టం కోసం సుహారిక మృతదేహాన్ని రేపు ఉదయం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాం. పోస్ట్ మార్టం తర్వాత మృతికి సంబంధించి మరింత సమాచారం వస్తుంది.`` అని వెల్లడించారు. బంధువుల వాంగ్మూలం, పోస్టుమార్టం నివేదిక సుహారిక మరణం విషయంలో కీలకంగా మారనుంది. కాగా, సుహారిక ఆకస్మిక మరణం కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం నివేదిక అనంతరం సుహారిక మరణంపై వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.