ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం జరిగిందన్న వార్త తెలుగు మీడియా వర్గలో వైరల్ అవుతున్నయి. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి టవర్స్ లో గురువారం సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కథనం. ఈ సందర్భంగా ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే రాయదుర్గం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగిందట. అయితే వైద్యులు ఆమెను పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారని సమాచారం.

 

దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎందుకు మరణించింది కుటుంబంలో ఏమైనా గొడవ లు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె స్నేహితురాలిని పోలీసుల విచారణ ప్రశ్నించే పనిలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు మృతి చుట్టూ అనేక అనుమానాలు నెలకొనడంతో ఈ వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. సుహారిక స్నేహితురాలు ఇంటిలో చనిపోవడంతో పోలీసులు సుహారిక ఫ్రెండ్స్ ని విచారణ చేస్తున్నారట.

 

ఇదిలా ఉండగా శుక్రవారం ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేయబోతున్నారట.  కోడలి మృతితో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం ఏర్పడింది. సుహారిక తల్లి భర్త ఫణీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ వార్త విని ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ నాయకులు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కి ఫోన్ చేసి సానుభూతి తెలుపుతున్నారు. ఏదో పార్టీలో బంధువులతో స్నేహితులతో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి సుహారిక మరణించినట్లు మరోపక్క టాక్ వినబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: