ఈ మధ్య కాలంలో వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు కొనసాగిస్తుంటారు..అయితే అది కూడా భర్త ఉందగానే మరొకరితో అలా చేస్తారు. చివరికి ఎవరోకరి కంట పడి చెప్పుకోలేక చెప్పలేక అవమానంతో తనువు చాలిస్తన్నారు.. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది.. అదేంటంటే పిన్నితో ఒక అబ్బాయి అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.. చివరికి అలా అడ్డంగా దొరికిపోయాడు. 

 

 


వివరాల్లోకి వెళితే.. వావి వరుసలు మరిచి పిన్ని వరుసయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ కామాంధుడు కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపేసిన ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో వెలుగుచూసింది. నిడుమోలు గ్రామానికి చెందిన కోట దుర్గారావు అనే వ్యక్తితో మరియమ్మకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. దుర్గారావుకు పిన్ని అయిన దేవనబోయిన ఎల్లమ్మ భర్తను వదిలేసి ఏలూరు నుంచి వచ్చి తన అక్క ఇంట్లోనే కొంతకాలంగా ఉంటోంది. ఈ క్రమంలోనే పిన్నితో దుర్గారావుకు సాన్నిహిత్యం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. దుర్గారావు, ఎల్లమ్మ అన్యోన్యంగా ఉండటాన్ని చూసి మరియమ్మ భర్తను నిలదీసింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి.

 

 

 

తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భార్య మరియమ్మను చంపేయాలని దుర్గారావు నిర్ణయించుకున్నాడు. ఈనెల ఆరో తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రబోతున్న భార్య గొంతు నులిమి చంపేసి కడుపు నొప్పితో చనిపోయిందని అందరినీ నమ్మించాడు. మరియమ్మ తల్లిదండ్రులు తమ కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కడుపునొప్పితో చనిపోలేదని, హత్యకు గురైందని వెల్లడైంది.

 

 


అయితే తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి కారణం అబ్బాయి వాళ్ళ తరపు బంధువులను అమ్మాయి పేరెంట్స్ చెప్పుకొచ్చారు.. అమ్మాయి తల్లి దండ్రుల పిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.. అనంతరం విచారణ చేపట్టారు.. దీంతో అసలు గుట్టు కక్కాడు.. అతని పిన్ని తో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను చంపేశాడు తెలిసింది.. పిన్ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: