రోజు రోజుకి దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువ అయిపోతుంది. నిన్న అనగా గురువారం నాడు మానవ జాతి సిగ్గుపడేలా కేవలం రెండు నెలల చిన్నారిపై జరిగిన సంఘటన అందరికి తెలిసిందే. ఇకపోతే నేడు మళ్లీ తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో మరో సంఘటన జరిగింది. కేవలం రెండు సంవత్సరాలు ఉన్న చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు తెగబడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాకు సంబంధించిన కోంబై గ్రామ చావిడి సమీప ప్రాంతానికి చెందిన గణేష్ ఓ ప్రముఖ రాజకీయ పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇక అదే ప్రాంతంలో నివసిస్తున్న రెండు సంవత్సరాల చిన్నారికి బుధవారం నాడు బిస్కెట్లు కొనిస్తాను అని చెప్పి తనతో తీసుకెళ్ళిపోయాడు. 


అలా తీసుకు వెళ్లిన అతను కొద్ది సేపు తర్వాత చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. ఇకపోతే అదే రోజు సాయంత్రం చిన్నారికి తన తల్లి స్థానం చేయిస్తుండగా శరీరంపై ఉన్న గాట్లను గుర్తించింది. అంతేకాకుండా ఆ పాప జననాంగాల వద్ద కూడా గాయాలు అయి ఉండడంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. అలా అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా గణేష్ (61 ) ఆ చిన్నారిని లైంగికంగా వేధించినట్లు తెలియడంతో అతడిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు కు ఆదేశించారు.

 

ఆ తర్వాత గురువారం నాడు సదరు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు పోలీసులు. దేశంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, నిర్ణయాలు తీసుకున్న ఇటువంటి దారుణాలు మాత్రం చిన్న పిల్లలపై వారి ప్రతాపాన్ని చూపిస్తూ వారి మరణానికి కారణమవుతున్నారు ఈ పాపాత్ములు. వీరికి ఎలా బుద్ధి చెప్తే.... ఎలా మారుతారో... ఎప్పుడు మారుతారో ఆ దేవుడికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: