కామాంధుల దాహానికి మరో బాలిక బలి అయిపోయింది. ఓ మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి ఇద్దరు యువకులు అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఇక ఆ తర్వాత అదంతా ఒక వీడియో తీసి ఆ అమ్మాయిని సంవత్సరకాలంగా అత్యాచారం చేస్తూ బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తామని అంటూ భయపెట్టి వారి కామ కోరికలను ఆ అమ్మాయిపై తీర్చుకుంటున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కారణంగా ఆ బాలిక స్వగ్రామానికి వెళ్లడం జరిగింది. అయితే వారు తీసిన వీడియోను వాట్సాప్ గ్రూప్స్ లో వారి ఫ్రెండ్స్ కు పంపించి వైరల్ చేశారు నీచులు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.

 

అసలు విషయంలోకి వెళితే... ఉపాధి కోసం ఇద్దరు అక్క చెల్లెలు నోయిడాకు వెళ్లి అక్కడ ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక అదే ప్రాంతంలో ఉంటున్న ఇద్దరు యువకులు పదిహేడేళ్ల దళిత మైనర్ బాలికపై వారి కన్ను పడింది. అయితే సమయం చూసి సదరు అమ్మాయికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించారు. ఇక ఆ అమ్మాయి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడంతో మత్తులోకి జారుకున్న ఆ అమ్మాయిపై కీచక పనికి పాల్పడ్డారు. వారిద్దరూ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక పశువుల ఆ అమ్మాయి మీద చేరి పశువాంఛ తీర్చుకున్నారు అని చెప్పవచ్చు. ఇలా చేస్తున్న సమయంలో ఆ కిరాతకులు వీడియో తీశారు. ఆ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి ప్రతిరోజు నరకం చూపిస్తున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు. 


లాక్ డౌన్ కారణంతో బాధితురాలు తన స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆ నీచులు అన్నంత పని చేశారు. ఆ వీడియోను వారి వాట్సప్ గ్రూపులలో వైరల్ చేసేసారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సదరు యువతి సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను వెంటనే పోలీసులు అరెస్టు చేసి వారి పై గ్యాంగ్ రేప్, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: