ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. మద్యానికి బానిస సొంత కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మద్యానికి బానిసై ఒక వ్యక్తి భార్యను నిత్యం వేధింపులకు పాల్పడేవాడు. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడు. ప్రతిరోజు వేధింపులకు గురి చేస్తూఉంటే ఆ భార్య తన తలరాత ఇంతే అని అనుకొని జీవనం కొనసాగిస్తోంది. కానీ తన బిడ్డల జోలికి వస్తే మాత్రం భర్త పాలిట మృత్యువు దేవతగా మారిందనే చెప్పాలి. మద్యం మత్తులో కొడుకులపై యాసిడ్ పోస్తాను అంటూ చెలరేగి పోవడంతో భర్తను ప్రెజర్ కుక్కర్ తో కొట్టి చంపేసింది ఆ తల్లి. 


ఈ దారుణమైన సంఘటన కడప జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం ప్రాంతానికి లక్ష్మీ శ్రీదేవి, నాగేశ్వరావు వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు... నాగేశ్వరరావు సొంత లారీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూవస్తున్నాడు. మద్యానికి బానిస అయ్యి నిత్యం భార్యని వేధించేవాడు. అంతే కాకుండా మద్యం తాగొచ్చి భార్యను రోజు కొడుతూ ఉండేవాడు. కానీ రెండు రోజుల కిందట ఫుల్లుగా సేవించి భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర వివాదం రావడంతో కొడుకులపై యాసిడ్ పోస్తానని భర్త బెదిరించడం జరిగింది. మద్యం మత్తులో అతను పిల్లలపై యాసిడ్ పోయబోతుంటే భార్య పక్కనే ఉన్న ప్రెజర్ కుక్కర్ తీసుకొని అతని తలపై బలంగా కొట్టింది. 


దీంతో అతని తలపై కుక్కర్ మూత బలంగా తగలడంతో భర్త అక్కడికక్కడే పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ సంఘటన తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా నాగేశ్వరరావు పై రౌడీషీట్ కూడా ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీస్  అధికారులు తరలించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: