ఈ సంవత్సరం జనాలకు బాగానే బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపించకుంటూ వెళ్తుంది. అయితే కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ చేసినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రతిరోజూ కేసులు పెరుగుతున్నాయి.. మరణాలు కూడా సంబవిస్తున్నాయి.  దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో భయపడుతుంటే.. ఈ మద్య మిడతల గోల ఒకటి మొదలైంది.. తుఫాన్, బీభత్సమైన ఎండలు వరుసగా మనిషి ఎంతో సతమతమవుతున్నారు. వీటితోనే ఛస్తున్నాంరా బాబూ అంటే.. ఇప్పుడు త్తర ప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక కోతి ల్యాబ్ టెక్నీషియన్‌పై దాడి చేసి.. అతని దగ్గర నుంచి ముగ్గురు కరోనా పేషంట్ల రక్త నమూనాలను ఎత్తుకెళ్లింది. శాంపిల్స్‌తో పాటు గ్లోవ్స్ కూడా తీసుకొని చెట్టుపైకి ఎక్కి కూర్చుంది.

 

అక్కడ ఆ కోతి గ్లోవ్స్ తినడానికి ప్రయత్నించింది.  కానీ దానికి కుదరలేదు.. విసిరివేసింది. వాటిలో ఒక కోతి కరోనా శాంపిల్ ను నోటితో పీల్చడం చూసి ప్రజలు హడలిపోయారు. దీనిపై డాక్టర్లు స్పందిస్తూ, ఆ కోతులకు కూడా కరోనా వస్తుందని చెప్పారు. ఇప్పుడా కోతుల కారణంగా  కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు.   అయితే కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ కరోనా శాంపిల్స్ కాదని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్కె గార్గ్ తెలిపారు.

 

కోతి ఎత్తుకెళ్లిన శాంపిల్స్ సాధారణ పరీక్షల కోసం తీసుకున్నవి. కరోనావైరస్ నమూనాలను ఓపెన్‌గా కాకుండా.. ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్తారు. కాబట్టి ఆస్పత్రి చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. కరోనావైరస్ మనుషుల నుంచి కోతులకు వ్యాపించగలదని ఇప్పటి వరకు రుజువుకాలేదు’ అని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కరోనా సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న జంతువులకు మాత్రమే కరోనా సోకిందని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: