ఈ ప్రేమ అనేది యువత సరదా కోసం పూర్తిగా మారిపోయింది.  కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు.  తీరా వారికి కావలసిన అవసరాలు తీరిన తర్వాత ఎవరి దారి వారిదే..అయితే ఇప్పుడు కాస్త మారిందని చెప్పాలి .. వావి వరుసలు లేకుండా పోయింది.. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఘోరాలు బయట పడతాయి.. ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు బయటకు వస్తాయి. 

 

 

 


అసలు విషయానికొస్తే .. ఆమెకు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడింది. భర్తని వదిలేసి వచ్చి మరీ ప్రియుడితో సహజీవనం చేసింది. తీరా తనను పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతో ప్రియుడి భార్య రంగంలోకి దిగింది. భర్తతో కలసి ప్రియురాలిని ఇంటి నుంచి బయటకు గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

 

 

 

అయితే అతనికి పెళ్లి కావడంతో  ఈమెతో పెళ్లికి నో అనడమే కాక ఆమెను బయటకు గెంటేశారు.. దీంతో ఆమె దిక్కు తోచని స్థితిలో కి వెళ్లి పోయింది.. అతనే అన్నీ అని నమ్ముకొని వచ్చిన ఆమెకు చుక్కెదురైంది..అతను వద్దు పొమ్మనడంతో షాక్ అయ్యింది.వివరాల్లోకి వెళితే..ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ధర్మవరంలో జరిగింది. పట్టణంలోని శారదానగర్‌కి చెందిన అంజలికి గతంలో వివాహమైంది. ఆమెకి కొడుకు కూడా ఉన్నాడు. ఫేస్‌బుక్‌లో పురుషోత్తం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బాగా దగ్గరవడంతో ఆమె భర్తని వదిలేసి వచ్చి మరీ పురుషోత్తంతో సహజీవనం చేస్తోంది.

 

 

 

అయితే ఆమె పెళ్లి చేసుకోమని కొంతకాలం నుంచి ఒత్తిడి చేస్తుంది..తన కోసం తన భర్తను వదిలేసి వస్తానని చెప్పింది. దీంతో అతడి భార్య రంగంలోకి దిగింది..పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది. భర్తతో కలసి ఆమెను ఇంటి నుంచి బయటికి గెంటేసింది. దీంతో మనస్థాపం చెందిన అంజలి చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: