కూతురు పెళ్లి ఘనం గా చేసింది.. అయితే భార్య భర్తల మధ్య ఉన్న మనస్పర్థల కారణం గా భర్త దగ్గర కు వెళ్లనని మొండి కేసుకొని కూర్చుంది..దాంతో అవమానంగా భావించిన ఓ తల్లి ఆత్మ హత్య కు పాల్పడింది.. వివరాల్లో కి వెళితే..పెళ్లైన కొద్ది రోజులకే కూతురు పుట్టింటి కి తిరిగొచ్చేసింది. అమ్మాయిని పంపించాలంటూ అత్తింటి వారు ఫోన్ చేస్తుండడం తో సమాధానం చెప్ప లేక భార్యా భర్తలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. అత్తింటి కి వెళ్లేందుకు కూతురు ససేమిరా అనడంతో ఏం చేయాలో దిక్కుతోచక తల్లి బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌ లోని వడోదరా లో జరిగింది.

 

 


లక్ష్మీపుర రోడ్డు కి చెందిన అనిత దేవసి దంపతుల కుమార్తెకు రాజస్థాన్‌ లోని పాలి జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లైన కొద్దిరోజులకే కూతురు అత్తింటిని వదిలి పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి భర్త దగ్గరకు వెళ్లనని భీష్మించుకుని కూర్చుంది. తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.. ఎంత చెప్పినా కూడా వినకుండా తన ఇష్టానికి కాదని పంపిస్తే శవాన్ని చుస్తరంటూ తెగేసి చెప్పింది..

 

 


అత్తింటి నుంచి ఫోన్లు వస్తుండడంతో సమాధానం చెప్పలేక దంపతులు ఒత్తిడికి గురయ్యారు. కూతురు ససేమిరా అనడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన తండ్రికి మూర్ఛలు వచ్చాయి. కూతురు భర్త దగ్గరికి వెళ్లకపోవడం.. తన భర్తకి మూర్ఛలు రావడంతో మనస్థాపానికి గురైన అనిత తమ ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు..తల్లి దండ్రులకు ఇలా జరగడంతో అందరూ కూతురు ను ఆడిపోసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: