సినిమా రంగంలో రాణించాలంటే బాగా హిట్ సినిమాలు ఉండాలి లేకపోతే విపరీతమైన పబ్లిసిటీ ఉండాలి. చాలా మంది హిట్ లేక బాధపడుతున్న వాళ్లు ప్రజలలో తమ పై క్రేజ్ పోకుండా వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ రావటానికి చిత్రవిచిత్ర పనులు చేస్తోంటారు. కొంతమంది మీడియా ముందే బట్టలు విప్పేసి ఇండస్ట్రీపై లేనిపోని మాటలు చెబుతూ ఆరోపణలు చేస్తే, మరికొంతమంది బూతులు తిడుతూ తమకి తాము పబ్లిసిటీ తెచ్చుకొంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా సెన్సిటివ్ విషయాలను టచ్ చేసి వివాదాస్పదంగా సినిమాలు చేస్తూ ఉంటారు.

IHG

కాగా వర్మ ని ఈమధ్య చాలామంది పబ్లిసిటీ కోసం ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా పూనమ్ కౌర్ చేస్తున్న పని ఈ విధంగానే ఉంది. ఆమె చేసింది ఏమిటంటే ఇటీవల ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లిన పూనమ్ కౌర్ నివాళులు అర్పించింది. గతంలో ఎప్పుడూ ఎన్టీఆర్ పై అభిమానం చూపని పూనమ్ కౌర్ ఇటీవల వెళ్లడంతో నందమూరి ఫాన్స్ షాక్ అయిపోయారు. అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తాజాగా ఈమె చేసిన ఈ పనికి సినిమాలు వల్ల వచ్చిన పబ్లిసిటీ కంటే ఈ ఫోటోల వల్ల మీడియా ద్వారా దక్కించుకున్న పబ్లిసిటీ విపరీతంగా వచ్చింది.

IHG

వివాదాస్పద అంశాలతో ఈ అమ్మడు ఎన్నో సార్లు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజాగా ఈ అమ్మడు చేసిన ప్రతి పని కూడా పబ్లిసిటీ కోసమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు పబ్లిసిటీ లలో ఈ రేంజ్ పబ్లిసిటీ ఎవ్వరికీ రాదు ఐడియా కూడా రాదు అని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: