గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్స్ చేస్తూ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతున్నారు జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు. ఇక ఆంధ్ర రాజకీయాల్లో కూడా ప్రతి అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి సంచలనం సృష్టిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీపై అధికార వైసీపీ పార్టీ పై కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక గత కొంతకాలంగా అయితే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ పార్టీపై తనదైన శైలిలో పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికలకు ముందు అయితే టిడిపి పై విమర్శల తో హోరెత్తించారు మెగా బ్రదర్ నాగబాబు. 

 

 ఇక తాజాగా మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. తదుపరి ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, బీజేపీ లలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది కాలమే నిర్ణయిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు  జనసేన నాయకుడు నాగబాబు . కానీ టీడీపీ మాత్రం కచ్చితంగా తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి రాదు అని కూడా నమ్మకం ఉంది అంటూ చెప్పారు. దీనికి కారణం కూడా తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు. తెలుగుదేశం పార్టీ తదుపరి ఎన్నికల్లో అధికారంలోకి రాదు అని అన్న దానికి కారణం... టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ చేసింది  ఏమీ లేదు అంటూ విమర్శించారు. 

 


 ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర అభివృద్ధి మొత్తం కేవలం టీవీ పేపర్లో మాత్రమే కనిపించింది... వాస్తవంగా మాత్రం టిడిపి అభివృద్ధి చేసింది ఏమీ లేదని చాలా తక్కువగా అభివృద్ధి పనులు చేసింది అంటూ ఎద్దేవా చేశారు జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు. తమ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదు కనుకే  ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది... ఈ విషయాన్ని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తే  బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ టిడిపి పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అనే భ్రమలో ఉన్నారు అని ఆ బ్రమ  నుంచి బయటపడితే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. లేదు మేము కలల ప్రపంచం లోనే జీవిస్తామంటే చేసేదేమీ లేదు అని... అలాంటి మానసిక స్థితిని హెల్యూసీనేషన్  అని అంటారు... ఆల్ ది బెస్ట్ ఫర్ హెల్యూసీనేషన్  అంటూ నాగబాబు తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: