అనుకోకుండా చేసినా..ఉద్దేశపూర్వకంగా తప్పు తప్పే అవుతుంది, దానికి తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా కలకలం తరుణంలో మన ప్రతి చర్యపట్ల జాగ్రత్త వహించాల్సిన సంగతి తెలిసిందే. అయితే, కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. అలా నిర్లక్ష్యంగా ఉన్న వారికి షాకిచ్చేలా తాజాగా ఓ షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్…ఇండియాలోకి ప్రవేశించి భయాందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర సర్కార్ కొత్త నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉమ్మేస్తూ, సిగరెట్ తాగుతూ లేదా ముక్కు చీదుతూ కనిపిస్తే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకు మన దేశంలో మహారాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ ప్రభుత్వం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్, 1897 కింద పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ కీలక నిబంధనలను పేర్కొంటూ ఆదేశాలు వెలువరింది. పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉమ్మేస్తూ, సిగరెట్ తాగుతూ లేదా ముక్కు చీదుతూ కనిపిస్తే వారిపై తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. నిబంధలను అతిక్రమిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష వేస్తామని హెచ్చరించింది. రెండోసారి కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే బ్రేక్ చేస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం ద్వారా కరోనా ఇన్ఫెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న భయాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది .దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా తమ రాష్ట్రంలోనే అధికంగా కరోనా కేసులు ఉన్నందున.. పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయడం, సిగరెట్ తాగడంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే చెప్పారు. ‘కరోనా వ్యాప్తిలో ఉమ్మడం కూడా ఓ భాగమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిషేధ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం’ అని తోపే పేర్కొన్నారు.