భార్య భర్తల మధ్య కీచులాటలు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. నువ్వెంత అనే ఆలోచన వస్తుంది.. దీంతో ఏదైనా కూడా చివరికి విడిపోయే వరకు తీసుకొస్తుంది.. అందుకే వారి మధ్య చిన్న గొడవలు ఉన్నప్పుడే సర్దుకోవాలి చెప్తున్నారు..ఇకపోతే సుఖంగా సాగుతున్న సంసారంలో అక్రమ సంబంధం అడ్డొస్తే వాటికి ఎదుర్కోవలసిన పరిణామాలు చాలా దారుణంగా మారుతాయి అన్న విషయం తెలిసిందే.. 

 

 


వివరాల్లోకి వెళితే..పరాయి మహిళతో అఫైర్ పెట్టుకున్నందుకు ప్రశ్నించిందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన మనీష్‌ కుమార్‌, సంధ్య దంపతులు. రెండు సంవత్సరాల క్రితం వారు బెంగళూరుకు వలస వచ్చి ఎఫ్‌సీఎల్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే మనీష్‌కుమార్‌ స్థానికంగా ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

 

 

 

 


ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె నిలదీసింది.. నేను వుండగానే మరొకరితో సంబంధం పెట్టుకుంటావా అని కోపొద్రురాలైంది.. దీంతో అతను ఆమె పై కోపాన్ని పెంచుకున్నాడు.. అంతేకాక ఆమె భర్త ఎఫైర్ గురించి తల్లి దండ్రులకు సమాచారం అందించింది.. అత్త మామలకు తన గురించి చెప్పి పరువు తీసిందని కక్ష్య పెంచుకున్నాడు.. అంతే కాక ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు.. ఓ రోజు రాత్రి అనుకున్న విధంగానే భార్యను చంపేశాడు..

 

 

 

 

ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంధ్య ఎత్తకపోవడంతో ఆందోళనపడిన ఆమె తల్లిదండ్రులు అదేరోజు సాయంత్రం రైలెక్కి ఆదివారం ఉదయం బెంగళూరు చేరుకున్నారు.అత్తమామలు ఇంటికొస్తే హత్య విషయం బయటపడుతుందన్న ఆందోళనకు గురైన మనీష్ మూడంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులు ఇంటికి చేరుకునేసరికే అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. ఏమైందోనని వారు వెళ్లి చూసేసరికి మనీష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఇంటి లోపలికి వెళ్లి చూడా సంధ్య మృతదేహం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరప్పన అగ్రహార పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అక్రమ సంబంధం అనేది వస్తె ఇలా మారతాయని ఈ ఘటన నిరూపించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: