ఈ మద్య క్షణికావేశంతో తాము ఏం చేస్తున్నాన్నమో అన్న విషయం మర్చిపోయి కృరంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు.  సంబంధ బాంధవ్యాలు కూడా మరచి ఐన వారినే దారుణంగా చంపేస్తున్నారు.  అప్పటి వరకు తమతో గడిపిన వారిని అంతలోనే దారుణంగా చంపేస్తున్నారు.  తాజాగా మద్యం మత్తులో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను చార్జర్ వైరును మెడకు చుట్టి  అంతమొదించాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావారి జిల్లాలో చోటుచేసుకుంది. పోలవరం మండలం ప్రగడపల్లి గ్రామానికి చెందిన వాకాటి నాగ దుర్గాదేవి(29)కి 2009లో ఉండ్రాజవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వాకాటి సురేశ్‌తో పెళ్లి జరిగింది. గత నెల వరకు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు పూర్తగా మూసి వేశారు. దాంతో చాలా మంది తాగుబోతురాయుళ్లు పిచ్చెక్కిన వారిలా ప్రవర్తించారు.  

 

అంతే కాదు మరికొంత మంది ఉన్మాదులుగా మారి ఎదుటి వారిని కొట్టడం.. చంపడం కూడా జరిగింది. ఇప్పుడు మద్యం షాపులు తీశారు.. అయితే విచ్చలవిడిగా తాగి కృరమృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కట్టుకున్న భార్యను మద్యం మత్తులో దారుణంగా హతమార్చాడు ఓ ప్రబుద్దుడు.  అయితే గత ఏడాది నుంచి సురేశ్ కూడా అత్తారింటికి వచ్చేసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సురేశ్ నిత్యం మద్యం తాగడానికి అలవాటుపడ్డాడు. మద్యం డబ్బుల కోసం నిత్యం భార్యను వేధించేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ భార్యతో గొడవపడ్డాడు.

 

క్షణికావేశంలో ఫోన్ ఛార్జింగ్ వైరుతో భార్య మెడను బిగించాడు. ఇదేమీ గమనించకుండా సురేశ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆప్పటికే ఊపిరాడక ఆమె మరణంచింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి మంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలవరం పోలీసులు సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనాస్థలాన్ని పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: