వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ తనను పక్కన పెట్టారని దుష్ప్రచారం జరుగుతోందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను వైసీపీని వీడనని... చివరివరకు జగన్ తోనే ఉంటానని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి స్పందిస్తూ ఆయనకు చురకలంటించారు. విశాఖలో విజయసాయి ప్రెస్ మీట్ చూసిన తరువాత అతని పై జాలేస్తుందని... విజయసాయి కాస్తా విఫలసాయిలా పేలవంగా మాట్లాడుతున్నారని... ఆయన ప్రెస్ మీట్ చూసిన తరువాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయని అన్నారు. 
 
విజయసాయిరెడ్డిని వైకాపా లోనే ఉంటావా అని అడిగింది ఎవరు? అని ప్రశ్నించారు. ఎవరూ అడగకుండానే ఆయన చచ్చేవరకూ వైకాపాలోనే ఉంటా అనడానికి కారణం ఏంటో చెప్పాలని అన్నారు. పార్టీ లో తలెత్తిన అంతర్గత విబేధాలు, ఆధిపత్య పోరు వలనే ఆయన బయటకు వచ్చి ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారా? అనే అనుమానం కలుగుతుందని చెప్పారు. కారులోంచి దించేసిన తరువాత విజయసాయి ప్రవర్తన లో ఎంతో మార్పు కనపడుతుందని వ్యాఖ్యలు చేశారు. 
 
ఒకప్పుడు ఢిల్లీ మొత్తం నాదే ,విశాఖ లో చీమ చిట్టుక్కుమ్మన్నా దాని వెనుక నేనే ఉన్నాను అన్న విజయసాయి ఇప్పుడు కేవలం సోషల్ మీడియా వ్యవహారాలు మాత్రమే చూస్తానని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని అని ట్వీట్ చేశారు. బుద్ధా వెంకన్న ట్వీట్లు విజయసాయిరెడ్డిని జైవిజయసాయి అని పొగిడినట్లే పొగిడి విమర్శలు చేస్తున్నట్టు ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: