కాలం మారుతున్న కొద్ది ప్రజల్లో మానవత్వం కూడా తగ్గిపోతుంది..అలాంటిది ఇప్పుడు క్రైమ్ రేటు పూర్తిగా పెరిగిపోతుంది.రోజు రోజుకు మనుషులు దారుణంగా  తయారవుతున్నారు.. డబ్బు పిచ్చిలో పడి దారుణాలకు పాల్పడుతున్నారు..లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అల్లాడుతున్న పేదలకు భోజనం పంపిణీ చేసే విషయంలో తలెత్తిన వివాదం ఓ కుటుంబం పై దాడి కి దారితీసిన ఘటన ప్రకాశం జిల్లావేటపాలెం మండలం లో ఆదివారం జరిగింది. కరణం వెంకటేష్ యూత్ ఆధ్వర్యం లో కొద్ది రోజులు గా చేనేతపురి కాలనీ లో పేదల కు భోజనం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.

 

 

 

ఈ కార్యక్రమాన్ని అనుభవం వెంకటేశ్వర్లు కుటుంబం పర్య వేక్షిస్తోంది. ఇది నచ్చని ఆమంచి కృష్ణ మోహన్ అను చరు లైన అనుములు శ్రీను అలియాస్ శివ, అతడి తమ్ముడు పృథ్వి మరో నలుగురు కలిసి ఆదివారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. ఇక్కడ ఏదైనా కార్య క్రమం చేయాలంటే తమ నాయకుడే చేయాలని, ఇతరులెవరూ చేయడానికి వీల్లేదని వారు హెచ్చరించారు.పేదలకు మంచి పని చేయడానికి ఎవరి అనుమతి కావాలని వెంకటేశ్వర్లు నిలదీయడంతో ఆ గ్యాంగ్ రెచ్చిపోయారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి అని అన్నారు..

 


 

 


వెంకటేశ్వర్లుతో పాటు ఆయన కొడుకు ప్రశాంత్‌ను చితకబాదారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకటేశ్వర్లు భార్య ఉమామహేశ్వరిని తీవ్రంగా కొట్టారు. తలను గోడకేసి బలంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను స్థానికులు చీరాలఏరియా హాస్పిటల్‌కు తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ సంఘాల నేతలు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రజలకు సాయం చేసేవారిపై ఇలాంటి దాడులు సమంజసం కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: