ఎక్కడ చూసినా మనుషుల మధ్య ఆప్యాయతలు తగ్గి నేరాలను ఘోరాలు చేస్తున్నారు..డబ్బు వ్యామోహంలో దారుణాలకు పాల్పడుతున్నారు..అందుకే క్రైమ్ రేటు పూర్తిగా పెరిగిపోతుంది.తమిళనాడులో కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి.  ఇటీవల నది రోడ్డుపై వ్యక్తిని చంపిన ఘటన పూర్తిగా మరువక ముందే మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నడి ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

 

 

 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఓ యువకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. దుండగులు అతడిని 35సార్లు కత్తితో పొడిచి శరీరాన్ని చిధ్రం చేయడమే కాకుండా.. తలను శరీరం నుంచి వేరుచేసి కిరాతకంగా ప్రవర్తించారు. కుల కక్షలే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. తూత్తుకుడి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని కీల కీరనుర్‌ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. గతేడాది వేరే వర్గానికి చెందిన వ్యక్తి చినిపోవడంతో గ్రామ శివారులోని శ్మశానంలో పూడ్చటానికి ప్రయత్నించగా మెజార్టీ వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలోనే సత్యమూర్తి(22) అనే యువకుడు ధైర్యంగా నిలబడి ఆ మృతదేహాన్ని అక్కడ పూడ్చేలా చేశాడు.

 

 

 

మెజార్టీ వర్గం ప్రజలు సత్యమూర్తిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సత్యమూర్తి రాత్రి 9 గంటలైనా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఊరి చివరలో తల లేని మృతదేహాన్ని చూసిన స్థానికులు సత్యమూర్తి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శరీరంపై ఉన్న గుర్తులతో అది తమ కొడుకు మృతదేహమేనని వారు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు నిలదీయడంతో తలను గుర్తించి పోస్ట్ మార్టం కోసం పంపించారు. 35 కత్తి పొట్లు  అతని శరీరం పై ఉందని తేల్చి చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: