మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అన్నట్టు మనిషి ఈ మద్య మానవత్వం మరచి కృర స్వభావంతో ఉంటున్నారు.  నా పరాయి అన్న తేడా లేకుండా చంపేందుకు సిద్దమవుతున్నారు.  ఇక కొంత మంది తమ పైశాచికత్వాన్ని అమాయకమైన జంతువులపై చూపిస్తున్నారు.  కేరళాలో దారుణం జరగింది.. గర్భంతో ఉన్న ఏనుగును కొంత మంది ఆకతాయిలు నోట్లో క్రాకర్స్ పెట్టడం.. అది కాస్త పేలడం లో చివరికి ఆ ఏనుగు చనిపోయింది. వివరాల్లోకి వెళితే..  కేరళ లోని మళప్పురం సమీపంలోని గ్రామంలో  గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం అడవి నుంచి ఈ గ్రామంలో ప్రవేశించింది.

 

ఆ ఏనుగు చూసిన కొంత మంది తమపై దాడిచేస్తుందని భయపడ్డారు.. మరొకొంత మంది దాన్ని తరిమేందుకు ప్రయత్నించారు.  అక్కడ నుంచి ఆ ఏనుగు అటూ ఇటూ తిరుగుతుంది.  ఇంతలోనే కొంత మంది దుర్మార్గులు.. పిచ్చి ఆలోచన చేశారు.  దానితో ‘ఆటవిక క్రీడ’ ఆడాలనుకుని.. క్రాకర్స్ (టపాకాయలు) నింపిన పైన్ యాపిల్ తినిపించారు. కొద్దిసేపటికే ఈ ఏనుగు నోటిలో క్రాకర్స్ పేలిపోవడంతో అది తీవ్రంగా గాయపడింది.

 

బాధతో గ్రామమంతా పరుగులు తీసినా అది ఎవరినీ గాయపరచలేదని, చివరకు వెల్లియార్ నదిలో దిగి తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నించిందని సోషల్ మీడియాలో ఈ ఉదంతాన్ని ప్రస్తావించిన అటవీ అధికారి మోహన్ కృష్ణన్ పేర్కొన్నారు. ఆ ఏనుగును బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.. రెండు గజరాజులను తీసుకువఛ్చినప్పటికీ.. ఫలితం లేకపోయిందని, నీటిలోనే అది నిలబడి ప్రాణాలు వదిలిందని ఆయన తెలిపారు. భారమైన హృదయంతో ఈ ఏనుగుకు తామే అంతిమ సంస్కారాన్ని నిర్వహించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: