కొన్ని హత్యలు అంతే.. అంత ఈజీగా ఎవరు చంపారో కనిపెట్టలేరు.. ఇంకా అలాంటి హత్యకు సంబంధించిన విషయాలే ఏడాది తర్వాత బయట పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లో గత సంవత్సరం జూన్ 14న జరిగిన యువతీ దారుణ హత్య కేసు ను పోలీసులు ఛేదించారు. గత సంవత్సరం ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరట్‌లోని లోహియా గ్రామ పొలంలో తల, చేతులు లేని శవాన్ని పోలీసులు గుర్తించారు. 

 

ఇంకా చేతులు, తల లేకపోవడంతో యువతిని గుర్తించడం కాస్త కష్టమైంది.  అయితే ఆమె శరీరంపై ఉన్న పచ్చ బోట్ల ఆధారంగా ఆమెను గుర్తించారు. ఇంకా ఈ కేసులో కీలక నిందితుడు ఎవరు అనేది ఎవరికి అంతుబట్టలేదు. గత సంవత్సరం నుండి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే టెక్నాలజీ సాయంతో లోహియా గ్రామానికి చెందిన షాకిబ్ అనే యువకుడే ఆమెను దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు.

 

ఉత్తరప్రదేశ్‌లోని లోహియా గ్రామానికి చెందిన షాకిబ్‌ అనే వ్యక్తి అక్కడే స్థానిక ఓ షాపులో పని చేస్తుండేవాడు. ఇంకా అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ళ యువతిపై అతడు మనసుపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పి పారిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. దీంతో ఆ యువతీ ఇంట్లోని నగలు తీసుకుని అతడితో పారిపోయింది. ఇంకా ఇద్దరు డౌరాలా ప్రాంతంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవించారు. అయితే కొద్దీ రోజులకు నిజం బయట పడింది. అతని నిజమైన పేరు అమన్ కాదు అని షాకిబ్ అని, వేరే మతస్తుడని యువతికి తెలిసింది. దీంతో అతడిని నిలదీసి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.. నగలు తీసుకుని మా ఇంటికి వెళ్లిపోతాను అని ఆమె చెప్పింది.

 

అయితే ఆమె నగలపై కన్ను పడిన షాకిబ్ ప్రియురాలిని చంపి సొంత చేసుకోవాలి అనుకున్నాడు. ఇంకా అలానే పక్కా ప్లాన్ తో ఆమెకు మత్తుమందు ఇచ్చి గొంతు నులిమి.. అతార్వత ఆమె శరీరం నుండి తలను చేతులను వేరు చేసి పరారయ్యాడు. ఇంకా మొదట్లో అతని వివరాలు ఏవి బయటపడలేదు.. అయితే మృతురాలి శరీరంపై పచ్చబొట్లు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: