మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో అందరితో కలివిడిగా ఉండటమే కాదు అందరినీ సొంత వారిలా చూసుకుంటూ సినిమాలలో రాణించాలంటే ఏం చేయాలి అని సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నాడు.. అందుకే చిరంజీవిని అందరూ అభిమానిస్తారు.. కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన చిరు గురించి చెప్పాలంటే ఎవరికీ మాటలు రావు..ఇక రాజకీయాల్లో కూడా అంతే చురుకుగా ఉంటూ అందరినీ పలకరిస్తూ వస్తారు..ఇటీవల సోషల్ మాధ్యమాల్లో అడుగు పెట్టిన చిరంజీవి ప్రేక్షకులతో పాటుగా సినిమా సబ్యులకు కూడా సందేశాలను అందిస్తున్నారు.. 

 

 

 

ఇది ఇలా ఉండగా చిరంజీవి ప్రపంచంలోని ఫేమస్ పర్సన్స్ బర్త్ డే లు జరిగితే వారికి ఇంటికి వెళ్లి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం లేదా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియ జేస్తూ వస్తున్నాడు.. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ పుట్టిన రోజు సందర్బంగా ఆమెను చిరంజీవి దంపతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు..తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు చిరంజీవి దంపతులు.గవర్నర్ బర్త్ డే సందర్భంగా.. రాజ్‌భవన్‌లో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిసి విషెష్ అందించారు. తొలుత ట్విట్టర్ ద్వారా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరు.. దేశసేవలో మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు చిరంజీవి. అనంతరం మంగళవారం మధ్యాహ్నం గవర్నర్‌ని కలిశారు చిరంజీవి. ఇటీవల సైరా చిత్రం రిలీజ్ సందర్భంగా గవర్నర్‌‌ని కలిశారు చిరంజీవి. సైరా సినిమా హిస్టరీని వివరిస్తూ సినిమా చూడాల్సిందిగా కోరారు చిరంజీవి.

 

 

 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గవర్నర్‌‌ పుట్టిన రోజు ఒకేరోజు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని గవర్నర్ కొనియాడారు. తెలంగాణను సంపన్నమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనం విజయం సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. చిరంజీవి, కేసీఆర్‌‌లతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు గవర్నర్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: