విజయ మాల్య అన్నది ఇపుడు ఒక బాడ్ బ్రాండ్ నేమ్  అయింది. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని ఎగ్గొట్టేవారిని ఆ పేరుతో పిలుస్తున్నారు. మాల్యా లాంటి వారు తమ తెలివితేటలతో వ్యాపారాలు చేసి ఆర్జించే బాగుంటుంది. కానీ వారు  ఏకంగా  అసలుకే ఎసరు పెడుతున్నారు. పేదలు నూటికి తొంబై శాతం దాచుకునే బ్యాంకులనే లూటీ చేస్తున్నారు.

 

అలా మాల్యా బ్యాంకులను ముంచేసి హాపీగా లండన్ చెక్కేశాడు. ఇక ఇండియాతో తనకు పనేమీ లేదనుకున్నాడు. అయితే మోడీ సర్కార్ మొత్తానికి అతన్ని భారత్ రప్పిస్తోంది. విజయ్ మాల్యా మీద బ్రిటన్ లోని కోర్టుల ద్వారా పోరాడి మొత్తానికి సాధిస్తున్నారు. బ్రిటన్ హై కోర్టులతో పాటు అక్కడి సుప్రీం కోర్టుల్లో కూడా మాల్యాకు ఎదురుదెబ్బలు తగిలాయి. దాంతో మాల్యా తప్పనిసరిగా ఇండియాకు రావాల్సివస్తోంది.

 

అతన్ని భారత్ తర‌లించేందుకు బ్రిటన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ మాత్రం పూర్తి కావాల్సిఉంది. అది కనుక అయితే ఏ క్షణమైనా మాల్యా భారత్ రావడం తప్పదు. ఆయన్ని మన దేశానికి తీసుకువచ్చి ఈడీ, సీబీఐ తమ అదుపులో తీసుకుంటాయి. తమదైన శైలిలో దర్యాప్తు చేసి మాల్యా నుంచి బ్యాంకులను ఎగ్గొట్టిన రుణాన్ని వడ్డీతో సహా కక్కిస్తాయని అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ఒక్క మాల్యా కేసులో భారత్ సాధించిన ఈ విజయం మిగిలిన నల్ల కుబేరులు, బ్యాంకులను అడ్డంగా దోచేసి పరార్ అయిన వారికి గట్టి షాక్ కాబోతోంది. బ్యాంకుల విషయంలో ఇకపై దోచాలనుకున్నా ఒకటికి రెండు మార్లు ఆలోచించేలా విజయ్ మాల్య కేసులో కనుక గట్టిగా దర్య్పాప్తు చేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఘరానా నేరగాళ్ళకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.

 

విజయ్ మాల్యాను కనుక భారత్ రప్పించి శిక్షించినట్లైతే మోడీ సర్కార్ ఇమేజ్ అమాంతం పెరగడం ఖాయం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కడో తలదాచుకుంటున్న వారిని తెచ్చి మరీ ఇలా బోనులోకి ఎక్కిస్తే మాత్రం మోడీ గ్లామర్ మామూలుగా ఉండదుగా.

మరింత సమాచారం తెలుసుకోండి: