గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనాని అరికట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు. అయితే కరోనా తో పోరాటం చేస్తున్న డాక్టర్లు, పోలీసులు కూడా దీని బారిన పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  . ఈ వైరస్ ప్రభావం, దాని తీవ్రతపై పూర్తి అవగాహన ఉన్న డాక్టర్లు, తమ ప్రాణాలను పణంగా పెట్టి, వైరస్ సోకిన వారిని రక్షించేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 31 మంది డాక్టర్లకు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్స్ కు వైరస్ సోకడంతో, అధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

IHG

రాష్ట్ర వైద్య వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులే వైరస్ కు హాట్ స్పాట్స్ గా మారుతున్నాయన్న ఆందోళన పెరిగిపోతున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ, ఈ సమావేశం నిర్వహించి, తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.  ఈ రెండు నెలల కాలంలో డాక్టర్లకు పెద్దగా వైరస్ ప్రభావం పడకున్నా.. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు మరింత పెరిగిపోతున్నాయి. 

IHG

ఈ క్రమంలో డాక్టర్లకు వైరస్ సోకుతుందని అంటున్నారు. ఇక వైరస్ సోకిన డాక్టర్లు గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నిమ్స్, పెట్లబుర్జ్ ఆసుపత్రికి చెందిన వారని అధికారులు వెల్లడించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన హెల్త్ వర్కర్లు, జూనియర్ డాక్టర్ల బృందం తెలంగాణ వైద్య మంత్రి ఈటల రాజేందర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లను కలిసి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: