మహిళ ల రక్షణ నిమిత్తం ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాల ను అమలు చేస్తుంది. నిర్భయ, దిశా లాంటి అమాయకులు తమ మాన ప్రాణాల ను సైతం వదిలేస్తున్న కూడా వారందరు ఎక్కడ మారలేదు. కామ కోరికలతో మరింత ఎక్కువగా రెచ్చిపోతున్నారు. వావి వరుసలు కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆడవాళ్లపై కామ కోరిక లు తీర్చుకుంటూ వారిని చంపేస్తున్నారు. 

 

 

 

మామూలు మగాళ్లు అంటే ఒళ్ళు కొవ్వెక్కి అనుకోవచ్చు కానీ ఎల్లప్పుడూ దేవుడు సన్నిధానంలో ఉంటూ ప్రజలకు హితవు పలికే వాఋ కూడా దేవుడికి ప్రత్యేక పూజలు అంటూ మాయమాటలు చెప్పి కోరికలను తీర్చుకుంటున్నారు. ఓ పాస్టర్ గా ఉన్న ఓ వ్యక్తి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

 

 

వివరాల్లోకి వెళితే.. ఆధ్యాత్మిక బోధనలు చెప్పాల్సిన మతగురువు కీచకుడిగా మారాడు. మంచి అబ్బాయి భర్తగా వచ్చేలా చేస్తానని, కరోనా వైరస్ సోకకుండా ప్రార్థనలు చేస్తానంటూ మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అమాయకురాలిపై మసీదులోనే అత్యాచారం చేశాడు. అయినప్పటికీ ఆగకుండా కోరిక తీర్చాలంటూ ఆమెను లైంగికంగా వేధించసాగాడు. ఆ కామాంధుడి వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

 

 

 


కర్ణాటకలోని మైసూరు జిల్లా హణసూరు సమీపంలోని చిల్కుంద గ్రామానికి చెందిన దంపతులకు ఓ కూతురు ఉంది. వారికి హణసూరు పట్టణంలోని లాల్ బన్ వీధికి చెందిన జబీవుల్లా అనే మత గురువు(మౌల్వీ)తో పరిచయమైంది. అప్పుడప్పుడు జబీవుల్లా వారింటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో దంపతుల కుమార్తెపై అతడి కన్ను పడింది. లాక్‌డౌన్ సమయంలోనూ అనేకసార్లు వారింటికి వచ్చి యువతిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాత ప్రత్యేక పూజల పేరుతో మసీద్ లోనే అన్నీ కానిచ్చాడు అడ్డంగా దొరికిపోయాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: