మన దేశంలో దొంగ స్వాముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరికి ఒక డాక్టర్ ఉంటాడో లేదో తెలియదు కానీ బాబా మాత్రం ఖచ్చితంగా ఉంటున్నాడు. నిజానికి ఊరిలో డాక్టర్లు, పోలీసులు కంటే కూడా బాబాలకే ఎక్కువ డిమాండ్ ఉంది అనుకోండి.. అది వేరే విషయం. ఇంకా ఈ నేపథ్యంలోనే మరో కొత్త కథనం తెర మీదకు వచ్చింది. నిజం చెప్పాలి అంటే ఇదో దారుణమైన ఘటన. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లా చిల్కుంద గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతుంది అయితే ఆ యువతీ దెయ్యం పట్టింది అని అనుకున్న బంధువు స్థానికంగా ఉన్న హణసూరు లాల్‌బన్ బజారుకు చెందిన జబీవుల్లా అనే స్వామిజీ వద్దకు తీసుకెళ్ళాడు. అయితే ఆ యువతిని చుసిన ఆ స్వామిజి ఆమెపై మంత్రాలు ప్రయోగించారు అని, దెయ్యం పట్టింది అని చెప్పాడు. 

 

దీంతో పిరియాపట్టణ దర్గా వద్దకు ఆమెను తీసుకొస్తే దెయ్యాన్ని వదిలిస్తా అని చెప్పి వెళ్ళాడు. దీంతో ఆ బంధువు ఆ యువతిని దర్గా వద్దకు తీసుకెళ్లాడు.. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆ బంధువును ఈ దెయ్యం వద్ద నువ్వు ఉంటే ఆ దెయ్యం నీకు పడుతుంది అని చెప్పి ఆమెను తీసుకొచ్చిన బంధువును దుర్మాగా పంపించాడు.. ఇంకా అనంతరం ఆ యువతికి స్నానము చేయించాలని బయటకు తీసుకెళ్లి ఆ స్వామిజి ఆమెపై అత్యాచారం చేశాడు. 

 

ఇంకా అప్పటికే మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆ యువతీ జరిగిన ఘటన అంత తన తండ్రికి చెప్పి వాపోయింది. దీంతో యువతీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాబాను విచారిస్తున్నారు. అందుకే ఏ బాబాని అంటే ఆ బాబాని నమ్మకూడదు అని అసలు బాబను నమ్మకూడదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: