ఈ మద్య మనుషులు పూర్తిగా మానవత్వం మరచిపోతున్నారు.. ఎదుటి వారు మనషులు వారికి కష్టం, కన్నీరు, బాధ ఉంటుందన్న విచక్షణ పూర్తిగా మర్చిపోతున్నారు.  దారుణంగా చంపడం కేసు నుంచి తప్పించుకోవడానికి ఎత్తులు వేయడం కామన్ అయ్యింది.  గొర్రెకుంట సామూహిక హత్య కేసులో ఎన్నో భయంకరమైన నిజాలు వెలుగు లోకి వచ్చాయి.  ఒక్క హత్యను కప్పిపుచ్చుకోవడానికి వరుసగా తొమ్మిది హత్యలు చేశారు.  అభం శుభం తెలియని చిన్నారిని కూడా వదల్లేదు. గొర్రెకుంట సామూహిక హత్యకేసులో నిందితుడు సంజయ్ కుమార్ ఎంత క్రూరంగా వ్యవహరించిందీ విచారణలో వెలుగులోకి వచ్చింది.   అపస్మారక స్థితిలో ఉన్న తల్లి వద్ద మూడేళ్ల చిన్నారి బబ్లూ గుక్కపట్టి ఏడుస్తుంటే ఏమాత్రం కనికరం చూపని నిందితుడు చిన్నారిని తీసుకెళ్లి అమాంతం బావిలో పడేసి చంపేశాడు.

IHG

తాజాగా గొర్రెకుంట సామూహిక హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నింధితుడు చెబుతున్న మాటలు, యాక్షన్ చూస్తుంటే.. కఠినంగా ఉండే పోలీసులే కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. సంజయ్‌ను నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయించారు. దీంతో ఆ తొమ్మిది మందినీ తానెలా హత్య చేసింది కళ్లకు కట్టినట్టు చూపించాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. నిందితుడు తొలుత మక్సూద్ ఇంట్లో వండిన ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అది తిన్న వెంటనే మక్సూద్, అతడి భార్య నిషా, కుమార్తె బుస్రా, కుమారులు షాబాద్, షాహెల్, మరో వ్యక్తి వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.

IHG

తర్వాత నెమ్మదిగా పై అంతస్తులోకి వెళ్లిన సంజయ్, అక్కడ ఉంటున్న శ్రీరామ్, శ్యామ్ వండుకున్న ఆహారంలోనూ రహస్యంగా నిద్రమాత్రలు కలిపాడు. ఆహారం తిన్న వారిద్దరు కూడా మత్తులోకి జారిపోయారు. ఇలా అందరూ మత్తులోకి వెళ్లిన తర్వాత ఒక్కొక్కరినీ గోనె సంచుల్లో చుట్టి ఒక్కొక్కరిని బావి వద్దకు తీసుకెళ్లి అందులో పడేశాడు. చిన్నారి బబ్లూ తల్లి వద్దకు వెళ్లి లేపేందుకు ప్రయత్నిస్తూ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. పసివాడన్న జాలి, దయ లేకుండా బబ్లూని ఎత్తుకుని తీసుకెళ్లి బావిలో పడేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: