మీరు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా... ఖచ్చితంగా రాబడి పొందాలని అనుకుంటున్నారా...? మీకోసం ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆప్షన్ తో మీకు ఖచ్చితంగా లాభం సమకూరుతుంది. లాభంతో పాటు పూర్తి రక్షణ కూడా లభిస్తుంది. ఈ ఆప్షన్ కి కేంద్ర ప్రభుత్వమే హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కీమ్ పేరు ఏమిటి అని అనుకుంటున్నారా పోస్ట్ఆఫీస్ వికాస్ పత్ర స్కీమ్ ద్వారా మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును మార్చడం జరుగుతుంది. అంటే వడ్డీరేటును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.. కాకుండా స్థిరంగా కూడా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్రం స్కీమ్ లో ఖచ్చితంగా మీరు లాభం పొందవచ్చు.

 

 

ఇండియా పోస్ట్ వెబ్సైట్ తెలియజేసిన సమాచారం మేరకు కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ గడువు 124 నెలలు. అంటే ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసే 124 నెలల్లో మీ డబ్బు రెట్టింపు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే వయస్సు అర్హత 18 సంవత్సరాలు ఉండాలి. అంతేకాకుండా ఈ స్కీమ్ ద్వారా జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే మైనర్లు కూడా ఈ స్కీమ్ లో చేరేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక మైనర్లు ఈ స్కీమ్ లో చేయాలి అంటే సంరక్షకులు కచ్చితంగా ఉండాలి. అలాగే ఈ స్కీమ్ లో వెయ్యి రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. 

 


ఇక ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది ప్రస్తుతం. ఈ వడ్డీ రేటు ప్రకారం స్కీం గడువు లోపు మీ డబ్బులు రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రెండు లక్షల వరకు పొందవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అత్యవసరంగా డబ్బులు అవసరం అయితే రెండు సంవత్సరాల ఆరు నెలలకు డబ్బులు విత్ డ్రా కూడా చేసుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా కెవిపి పత్రాలను కూడా ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే ఈ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని లబ్ది పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: