భారత దేశంలో అత్యంత విషాదాన్ని నింపిన సంఘటన ముంబాయి పేలుళ్లు.  ఈ దురాఘతానికి మూల సూత్రదారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.  1993 లో ముంబాయి పేలుళ్ల తర్వాత భారత దేశాన్ని వదిలి పాకిస్థాన్ పారిపోయాడు దావూద్.  ప్రస్తుతం కరాచీలో తన నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.  భారత్ ని వదిలి పాకిస్థాన్ పారిపోయాడు. అక్కడే ఇప్పటి వరకు తలదాచుకొని తన నెట్ వర్క్ నడిపించాడు.  అప్పటి నుంచి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భారత్ అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీకి సంబంధించి భార‌త్ అందించిన చిరునామాల‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి నిర్ధారించింది.
 
 
కానీ ఈ మాఫియా డాన్ ని ఇప్పటి వరకు పట్టుకోలేక పోయారు. ముంబాయి పేలుళ్ల తర్వాత దావుద్ ఇబ్రహీబ్ జీవితాన్ని బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు వచ్చాయి.  దావూద్ వద్ద పని చేసిన వాళ్లు తిరిగి ఆయన్ని చంపడానికి ప్రయత్నించి వారిలో చోట షకిల్ ఉన్న విషయం తెసిందే.  బాలీవుడ్ లో మాఫియా తరహా సినిమాలకు కొత్త ట్రెండ్ తీసుకు వచ్చాడు దావూద్.  దావూద్ ఇబ్రహీం క‌థాంశం తెరకెక్కిన మూవీ రిలీజ్‌కు సిద్దమ‌వుతుంది. అదే ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్ ఎగైన్‌. అక్షయ్‌కుమార్‌,సోనాక్షిసిన్హా జంట‌గా న‌టించిన ఈ మూవీకు సంబంధించిన ఒక వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఇందులో దావూద్ గెట‌ప్‌లో అక్షయ్‌, దావూద్ ల‌వ‌ర్ గెట‌ప్‌లో సోనాక్షి లు నటించారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: