ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్నాయి కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పర్వాలేదు అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడంలో విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య లాక్ డౌన్  పొడగిస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ ఈ నెల 30వరకు పొడిగించారు. 

 

 ఇదే సమయంలో ఎన్నో సడలింపు కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఇన్ని రోజుల వరకు దేవాలయాలు మూసి వేయగా ప్రస్తుతం దేవాలయాలు పున ప్రారంభించేందుకు కూడా మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హోటళ్లు రెస్టారెంట్లు కూడా తెరవనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. దేవాలయ నిర్వాహకులు.. రెస్టారెంట్ హోటల్ యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమ నిబంధనలతో కూడిన కొత్త జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తోంది.

 

కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమల్లో ఉంటాయి.రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకోవచ్చు.అయితే, ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు చేసుకోవాలి.తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం పట్ల నిషేధం.అన్నదానం నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి.ఆలయాల్లో క్యూ లైన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి.కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్మాళ్లు తెరుచుకోవచ్చు. (హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ తీసుకెళ్లేందుకే అధిక ప్రాధాన్యత)షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్యఉండేలా చూడాలి.ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి.డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈ-వాలెట్ సౌకర్యం కల్పించాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: