రెండు తెలుగు రాష్ట్రాల‌ రాజకీయాల్లో తెలంగాణా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ ఎనుముల‌ రేవంత్ రెడ్డికి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో రేవంత్ రెడ్డికి తెలంగాణా కంటే ఎక్కువగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ వారు ఆయనను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో కీల‌క నేత‌గా ఎదిగారు. ఏపీలో తెలుగుదేశం అభిమానులు అంద‌రూ రేవంత్‌ను ఓ హీరోగా చూస్తుంటారు. ఇప్పుడు ఇదే ఆయనకు ప్రధానంగా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు రేవంత్ విషయంలో అతి చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

అతనిని వాళ్ళు ఇప్పుడు మరింతగా కీర్తిస్తున్నారు అని అది అతనికి ఇబ్బందిగా మారుతుందని ఆంధ్రా కోవర్ట్ అనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలపడుతుందని  రేవంత్ కి కీలక పదవులు రాకపోవడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. ఇప్పుడు టీ పీసీసీ రేసులో రేవంత్ ఉన్నా కూడా రేవంత్‌కు ప‌ద‌వులు ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ కీల‌క నేత‌లే ఒప్పుకోవ‌డం లేదు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉండే మల్కాజ్ గిరి లో రేవంత్ విజయం సాధించాడు అని పక్కా తెలంగాణా వారు ఉండే కోడంగల్ లో ఓడిపోయాడు అని అంటున్నారు. 

 

ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఆయన విషయంలో అనవసరంగా పూసుకుని వ్యాఖ్యలు చేస్తే రేవంత్ భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ నేతలు ఆయనను ఒక దోషి గా చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇక రేవంత్ కూడా పదే పదే చంద్రబాబుని కీర్తించడం మానుకుంటే మంచిది అని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: