ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం అనేది ఒక కల అనే విషయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి కూడా అర్ధమయ్యే ఉంటుంది అనేది చాలా మంది మాట్లాడే మాట. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బాబుకు వీర విధేయులుగా ఉన్న వారు సైతం చంద్ర‌బాబును న‌మ్మే ప‌రిస్థితి లేదు. అస‌లు మాజీ మంత్రి సిద్ధా రాఘ‌వ‌రావు ఏకంగా రెండు ద‌శాబ్దాల‌కు పైగా చంద్ర‌బాబుకు న‌మ్మిన బంటుగా ఉండ‌డంతో పాటు ప్ర‌కాశం టీడీపీలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు. 

 

ఇక రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు పార్టీని లైట్ తీసుకుని ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాదాపు అదే విధంగా అడుగులు వేయడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబుకి గుడ్ బై చెప్పడానికి ఎవ్వ‌రూ ఊహించ‌ని అగ్ర నేతలు కూడా సిద్దంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రితో పాటుగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఇప్పటికే వైసీపీలో చేరడానికి గానూ సిద్దమయ్యారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

 

ఆయన ఇప్పటికే చంద్రబాబుకి కూడా ఇదే విషయాన్ని చెప్పారు అని పరిశీలకులు  అంటున్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వేధిస్తున్నారు అనే ఆందోళన సదరు నేతలో ఎక్కువగా ఉందని, అలాగే ఒక సీనియర్ నేత మాటలు విని తనను పక్కన పెడుతున్నారు అని కూడా ఆయనలో ఆగ్రహం ఉంది అని అందుకే ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు అని అంటున్నారు. ఆయన త్వరలోనే పార్టీ మారడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఆయనతో పాటుగా గుంటూరు జిల్లాకు చెందిన నేతను కూడా తీసుకెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: