ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా మైనస్ ఎవరు అనగానే చాలా మంది చెప్పే మాట ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన కారణంగా ఆ పార్టీ చాలా వరకు నష్టపోతుంది అని ఆ పార్టీ నేతల్లోనే మంది చాలా సందర్భాల్లో అన్నారు కూడా. చంద్రబాబు లోకేష్ ని పక్కన పెట్టకపోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చాలా మంది నేతలు సూచించినా బాబు మాత్రం తనయుడిని ముందు పెట్టుకునే ఇంకా రాజకీయాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడు అయితే నందమూరి ఫ్యామిలీని పక్కన పెట్టేసి లోకేష్ ను ప్రొజెక్ట్ చేశారో అప్పుడే పార్టీకి దెబ్బ పడిపోయింది.
ఇప్పుడు చంద్రబాబుకి లోకేష్ కారణంగా ఒక నమ్మకమైన నేత దూరం అయ్యారు అని రాజకీయ పార్టీ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబుని నమ్ముకుని అడుగు వేసిన ఒక కీలక నేత ఇప్పుడు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు అని... లోకేష్ కారణంగానే ఇది అంతా అని పార్టీలో వ్యాఖ్యలు వినపడుతున్నాయి. లోకేష్ ఎప్పుడు అయితే మంత్రి అయ్యారో సీనియర్ అని తనను పక్కన పెట్టారు అని అయన ఆవేదనగా ఉన్నారట.
అందుకే ఇప్పుడు చంద్రబాబు కి దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల చంద్రబాబుని కలవడానికి వెళ్ళిన సమయంలో కూడా లోపలికి వెళ్ళకుండా కొందరు అడ్డుకున్నారు అని అక్కడ లోకేష్ ఉన్నా సరే ఆయనను లోపలికి రానీయలేదు అని అంటున్నారు. లోకేష్ కి అన్ని విధాలుగా తాను ముందు నుంచి సహకారం అందించాను అని ఇప్పుడు పక్కన పెట్టారు అని సన్నిహితుల వద్ద వాపోయారట.