టాలీవుడ్ సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి మెగాస్టార్ చిరంజీవి ఒక బృందాన్ని నిన్న అమరావతికి తీసుకుని వెళ్లారు. అయితే కొందరు మహిళలు అమరావతి రైతులంటూ చిరంజీవి ఉన్న గెస్ట్ హౌస్ ముందు నిరసన తెలియజేసారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని... మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడాలని డిమాండ్ చేశారు. 


చిరంజీవి మాత్రం దానిపైన స్పందించకుండానే అక్కడ నుండి వెళ్లిపోయారు.  అయితే ఈ నిరసన తెలుగుదేశం పార్టీ చేయించిందా అనే అనుమానాలు మెగా అభిమానుల్లో ఉన్నాయి.  అమరావతి కోసం ప్రాణ త్యాగానికి అయినా సిద్ధం అంటూ ప్రగల్భాలు, జోలి పట్టి నిధులు సేకరించినట్టు నాటకాలు, గత 5 నెలలు నుండి అటువైపు చూడని చంద్రబాబు అమరావతి వస్తే ధర్నాలు లేవు నిరసనలు ఉండవు.

 

కానీ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వస్తే మాత్రం తెరపైకి కుల నాటకాలు, డ్రామాలకు తెరతీస్తారు, ఎందుకు?  సందర్భంగా ఆయన్ను అనేక మీడియా వారు ప్రత్యేక ఇంటర్వ్యూ లు చేశారు, కాని ఏ ఒక్క ఛానెల్ వారు కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ గారిని అమరావతి కోసం ప్రశ్నించలేదు. కాని రాజకీయాలకు సంబంధం లేని చిరంజీవి గారిని మాత్రం కుల మీడియా టార్గెట్ చేస్తుంది.

 

ఇది ఉద్దేశపూర్వకంగానే కుల ద్వేషంతో చిరంజీవిని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యమప్పుడు, పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీకి మద్దతు ఉపసంహరించినప్పుడు ఇటువంటి దాడినే తమ మీడియాతో చేయించారు చంద్రబాబు. కాగా యెల్లో మీడియా పై మెగా బ్రదర్ నాగబాబు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇదేనా పత్రికల స్పిరిట్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  మీకు జగనే కరెక్టు అంటూ ట్వీట్ చెయ్యడం గమనార్హం.  మరోవైపు... పవన్ కళ్యాణ్ సొంత మీడియాని ఏర్పాటు చేసుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: