ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్  విజృంభిస్తుంటే మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నవయసులోనే ప్రేమలో పడి అది విఫలం అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చాలానే చేస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనే ఒకటి అనంతపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం మీద పూర్తి వివరాల్లోకి వెళితే... జిల్లాలోని గుత్తి లో దారుణమైన సంఘటన జరిగింది..

 


తన ప్రేమ విఫలం అయిందని ఒక విద్యార్థిని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుత్తి పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రామ అనే విద్యార్థి డిగ్రీ విద్య అభ్యసిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ తరుణంలోనే ఆ యువతి తన ప్రేమను అంగీకరించకపోవడంతో రాము తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఆత్మహత్య చేసుకునే ముందు లవ్ ఫెయిల్యూర్ పాటలకు టిక్ టాక్ చేశాడు రాము. ఇక ఈ పాటలు అన్నీ కూడా తన టిక్ టాక్ లో అప్లోడ్ చేసి ఆ తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 


ఇలా ప్రేమ విఫలం అయిందని అనేకమంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనా గానీ ఇలా చిన్న విషయాలకు ఆత్మహత్యకు పాల్పడుతూ తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. ఇక సంఘటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా క్షణిక ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు తీవ్ర విషాదం నెలకొల్పుతున్నారు. చేతికి వచ్చిన కొడుకు ఒక్కసారిగా ఇలా అవ్వడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి చర్చించి తీసుకుంటే మంచిది. కాబట్టి ఎవరైనా ప్రేమించవచ్చు... కానీ ప్రేమ విఫలమైందని ఇలాంటి దారుణాలకు పాల్పడితే వారిని నమ్ముకొని ఉన్న తల్లిదండ్రులు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: