టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ అంటే లోకువో, చులకన భావమో తెలియదు కానీ, ఆయనపై సెటైర్లు వేసేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ.. ఏదో ఒక అంశంపై ఆయనను టార్గెట్ చేసుకుని అభాసుపాలు చేసేందుకు ముందుకు ఉత్సాహంగా వస్తూ ఉంటారు. ఇక అందరికంటే ఎక్కువ ఉత్సాహంతో లోకేష్ పై సెటైర్లు వేసే వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి. నిత్యం చంద్రబాబు పైన, లోకేష్ పైన ఏదో ఒక సెటైర్ వేయకపోతే ఏదో లోటు గా ఉంటుందని అనుకుంటారు ఏమో తెలియదు కానీ, కాస్త ఘాటుగా ... మరి కాస్త వ్యంగ్యంగా లోకేష్ పై విజయ సాయి రెడ్డి జోకులు పేల్చుతూ తన ట్విట్టర్ ఫాలోవర్స్ కి వినోదం పంచుతూ ఉంటారు.
Chinna babu cannot connect with telugu people and all have rejected him outrightly, @ncbn seems to have decided to make him the international President of tdp to deal with leaders like Kim Jong-Un & others.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 11, 2020
కొద్దిరోజులుగా టిడిపి అధ్యక్ష పదవిని భర్తీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద రాద్ధాంతం జరుగుతోంది. ముఖ్యంగా ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించారు. చినబాబు తెలుగు ప్రజలకు కనెక్ట్ కాలేక పోయారని, ఆయనను అందరూ తిరస్కరించారని, అందుకే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు అన్నారు. కిమ్ జాంగ్ ఉన్, ఇతర ప్రపంచ స్థాయి నేతలతో చర్చలు జరపడానికి, లోకేష్ ను టిడిపి జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడానికి సిద్ధం అవుతున్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
అంతకుముందు కూడా ఇదే రకంగా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. 'కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు' సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ళ కిరీటం తగ్గిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోవాలని చూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నారు అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.