ఈ కరోనా కాలంలో మహిళలపై రోజురోజుకి అఘాయిత్యాలు, అమానుష సంఘటనలు ఎక్కువవుతున్నాయి. దేశంలో రోజుకి ఏదో మూలన ఇలాంటి అమానుష సంఘటనలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే తాజాగా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తన తండ్రి సొంత కూతురి పై కన్నేశాడు. అది కూడా వికలాంగురాలు అయినా కుమార్తెపై. ఈ అమానుష సంఘటన త్రిపుర రాష్ట్రం లోని లాల్చెరా గ్రామంలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. ఇకపోతే ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 


లాల్చెరా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాగుడికి బానిసగా మారాడు. ఇకపోతే ఆయన భార్య ఇంట్లో లేని సమయంలో తన సొంత కూతురు వికలాంగురాలిపై కన్నేసిన దుర్మార్గుడు మద్యం మత్తులో ఉన్న అతను కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇకపోతే శుక్రవారం నాడు బాధితురాలి తల్లి ఇంటికి తిరిగి రాగానే తనకు జరిగిన ఘోర అవమానంని తల్లితో చెప్పుకుంది. ఆగ్రహం తెచ్చుకున్న తల్లి వెంటనే తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దింతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతనిని పట్టుకొని పూర్తి విచారణ చేపట్టనున్నారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత రిమాండ్ కు తరలించారు పోలీసులు.

 


ఇలాంటి నిందితుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు, కఠిన చట్టాలు తీసుకొచ్చినా వారు మాత్రం మారట్లేదు. నిర్భయ చట్టం తీసుకువచ్చిన ఇలాంటి క్రూర మృగాలు మన మధ్య తిరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వారికి రోజులు తరబడి జైల్లో ఉంచకుండా తక్షణమే వారికి శిక్ష అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి దుర్మార్గులు మారుతారేమో వేచి చూడాలి. నిజానికి ఇలాంటి సంఘటనలు కొన్ని మారుమూల ప్రాంతాల్లో బయటికి రాకుండా అక్కడి ఉండే పెద్దల సమక్షంలో రాజి కుదిర్చి అక్కడే వాటిని పరిష్కారం చేస్తున్నారు. దీంతో వారు ప్రజల్లోనే ఉంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: