పదేళ్ల దెబ్బలు తిని ఢిల్లీని ఢీ కొట్టి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ పై  2019 ఎన్నికల్లో నామరూపాలు లేకుండా జగన్ గెలవడం జరిగింది. రాజకీయంగా తన ప్రత్యర్థిగా ఉన్న 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని రాబోయే రోజుల్లో తనకి అడ్డు లేకుండా చేసుకోవడానికి దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి వైయస్ జగన్ రెడీ అయినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి పరిశీలకులు అంటున్నారు. ఏ మాత్రం టైమింగ్ ఇవ్వకుండా దెబ్బ పడిన వెంటనే మరొక షాక్ ట్రీట్మెంట్ వైయస్ జగన్ ఇస్తున్నారని 2024 ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే చాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ టీడీపీ పార్టీకి అండగా ఉన్న బలమైన నాయకులను టార్గెట్ చేస్తూ వారు గత ప్రభుత్వం చేసిన ప్రతి అవినీతి ని బయట పెడితే చట్టరీత్యా అరెస్టులు చేయడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఎపిసోడ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ వైయస్ జగన్ ఎన్నికలకు ముందే పక్కా ప్లానింగ్ తో ప్రిపేర్ చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాలలో వినపడుతున్నాయి. సరిగ్గా పాదయాత్ర చేస్తున్న టైంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ కి ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్ గురించి వివరించరట. వైసీపీ పార్టీ అప్పట్లో టీడీపీ పార్టీ చేసిన అవినీతి కార్యక్రమాలను ఓ బుక్ రూపంలో ప్రచురించడం జరిగింది.

 

దాని ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో అరెస్టుల పర్వం కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగానే అరెస్టులు కొనసాగితే రాబోయే రోజులో పార్టీ కనుమరుగవడం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది. అప్పటినుండి వైసీపీ పార్టీలో ప్రజెంట్ అరెస్ట్ అవుతున్న టిడిపి నాయకుల యొక్క బండారం మొత్తం బయట పెట్టే బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందని, ఫస్ట్ యాడాది ప్రజలను ఫుల్ శాటిస్ఫ్యాక్షన్ చేసి, సరిగ్గా సెకండ్ ఏడాది స్టార్ట్ అయిన నాటి నుండి విల్లా భరతం జగన్ పట్టాడని పరిశీలకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: