ప్రస్తుత కాలంలో  ప్రేమ విఫలం అయిందని దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు చాలానే చూస్తున్నాం. నాలుగు సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించిన యువకుడు తనతో పెళ్లికి ఒప్పుకోవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తని సమీపంలోని నల్లటూరు గ్రామానికి చెందిన మనిమేఘలై(20), పాల వేడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ (25 ) ఇద్దరు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 

 


రాజ్ కుమార్ ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ విషయం రాజ్ కుమార్ ఇంట్లో తెలియడంతో గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి అతని తల్లిదండ్రులు నిరాకరించడం జరిగింది.  దీనితో మనస్థాపానికి గురి అయిన మనిమేఘలై ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని రాజ్ కుమార్ ను అడగగా, అతను కుటుంబాన్ని వదిలి నేను రాలేను అని తెలిపాడు. దింతో తల్లిదండ్రులకు ఎదిరించి నేను పెళ్లి చేసుకోలేను అని తేల్చి చెప్పాడు.

 


ఇక ఆమె మనస్తాపానికి గురై ఉదయం సమయంలో ఇంట్లో ఎవరూ లేని చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ సంఘటనపై కనకమ్మ సత్రం పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇలాంటి చిన్న విషయాలకు అనవసరంగా ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రుల ఆశల్ని అడియాశలు చేస్తున్నారు చాలా మంది యువత. కాబట్టి ముందు మీరు జీవితంలో స్థిరపడిన తర్వాత మీ ఆలోచనలకు చోటు ఇవ్వండి.

 


ముందుగా ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి ఆ తర్వాత మీ సొంత నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇలా అర్ధాంతరంగా మీ ప్రాణాలను కోల్పోయి మీ కుటుంబ సభ్యులకు ఎనలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చవద్దు. చేతికందికి వచ్చిన కొడుకులు కుమార్తెలు చూస్తూ ఆనందపడే తల్లిదండ్రులకు ఇలాంటి సంఘటనలు వారు జీవితంలో మరోసారి కోలుకో లేకుండా చేస్తాయి. అంతేకాదు మీ ఇంట్లో ఉండే మీ అన్నదమ్ములకు లేకపోతే మీ అక్కాచెల్లెళ్లకు దీని మీద ప్రభావం చాలా పడుతుంది, కాబట్టి ఏదైనా  నిర్ణయం తీసుకొనే ముందు మీ కుటుంబ పరిస్థితిని ఆలోచించి తీసుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: