ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ... ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదో ఒక అంశంపై టిడిపి వైసిపి పై విమర్శలు చేస్తునె ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. అధికార పార్టీ తీరును ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు నారా లోకేష్ . తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

 

 అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన ఒక వీడియో ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ వస్త్రాలు సందించారు నారా లోకేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు  జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ప్రశ్నోత్తరాలు కూడా హోరాహోరీగా ని జరిగాయి. 

 

 అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిద్రపోతూ కనిపించిన దృశ్యాలతో ఒక వీడియో ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా  ఇలాగే నిద్రపోయాడు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా  అదే పని చేస్తున్నాడు అంటూ కాస్త సెటైరికల్ గా  చెప్పుకొచ్చాడు నారా లోకేష్. జగన్ అనే నేను అనే అసెంబ్లీ శీర్షిక  తో వీడియో రూపొందించిన నారా లోకేష్.. ఇంట్లో పబ్జి అసెంబ్లీలో లాలిజో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: