కేరళలో ఈరోజు కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 60మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 2622కేసులు నమోదుకాగా అందులో 1366కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1234 మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 20 మంది మరణించారు. 
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈరోజు 1515 కేసులు నమోదు కాగా  ఈఒక్క రోజే రికార్డు స్థాయిలో 49మంది మరణించారు. ఆ రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 48019కు చేరగా ఇప్పటివరకు 528 కరోనా మరణాలు సంభవించాయి అలాగే కర్ణాటకలో ఈరోజు 317 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 7530కి చేరింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 264కేసులు నమోదు కాగా తెలంగాణ లో 213కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 350000 దాటగా 10000 మరణాలు చోటుచేసుకున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: